వార్తలకు తిరిగి వెళ్లండి
మాగల్లులో లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ మహాకుంభాభిషేకం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగల్లులో 108 అడుగుల భారీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహానికి మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది. కర్ణాటక హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి మహాస్వామి చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తొమ్మిది పవిత్ర నదీ జలాలతో కుంభాభిషేకం, అనంతరం మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా పల్లగిరిపై ఉన్న త్రిశక్తి దేవాలయంలో కూడా కుంభాభిషేకం చేపట్టారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...