Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూలిపోయిన ఇళ్ళను పరిశీలించిన అధికారులు

Follow Udayam on Google
p.g.murthy Jul 30, 2026 4:21 PM మంచిర్యాలGeneral
కూలిపోయిన ఇళ్ళను పరిశీలించిన అధికారులు - Udayam
దండేపల్లి మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షాలతో దెబ్బతిన్న ఇండ్లను మండల అధికారులు పరిశీలించారు. భారీ వర్షాలతో మండలంలోని కాసిపేట గ్రామంలో నాలుగు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ ఇళ్లను మండల తాసిల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపీడిఓ ప్రసాద్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ద్వారక, గుడిరేవు, గూడెం వద్ద గోదావరిని పరిశీలించారు.

Comments

G
Loading comments...