వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థుల నిరసనకు మద్దతుగా కేటీఆర్ నిర్ణయం

ఢిల్లీలో విద్యార్థుల నిరసనలకు సంఘీభావంగా రేపు తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిర్ణయించారు. విద్యార్థులపై పోలీసుల అణచివేతను నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
రేపు ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం చేపట్టే ధర్నాలో కేటీఆర్ పాల్గొని, విద్యార్థుల ఆందోళనలకు పూర్తి మద్దతు ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...