వార్తలకు తిరిగి వెళ్లండి
స్పీకర్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
రవళి దేవి Jun 29, 2026 6:40 AM వికారాబాద్ 1 viewsabout 2 hours ago

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పులు ఆయనకు కనిపించడం లేదని కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తీరును ఆయన తప్పుబట్టారు.
శిశుపాలుడి వంద తప్పుల మాదిరిగానే కాంగ్రెస్ అక్రమాలను లెక్కపెడుతున్నామని, వారి దుకాణం బంద్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...