Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుల్లెట్ రైలు కారిడార్ సర్వే ప్రారంభం

దివ్య శ్రీ Jun 29, 2026 7:16 AM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago
బుల్లెట్ రైలు కారిడార్ సర్వే ప్రారంభం - Udayam Digital
హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు మార్గాల్లో బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో రూట్‌ మార్కింగ్‌ చేస్తున్నారు. ప్రత్యేక రంగులతో సర్వే పాయింట్లను గుర్తిస్తూ ఎలైన్‌మెంట్ ఖరారు చేస్తున్నారు. ఏరియల్‌ సర్వే అనంతరం, భూసేకరణ మరియు స్టేషన్ల స్థానాలను ఖరారు చేసేందుకు ఈ సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కారిడార్ల సర్వే పూర్తయితే ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత రానుంది.

Comments

G
Loading comments...