వార్తలకు తిరిగి వెళ్లండి
కాంగ్రెస్పై కేటీఆర్ ఆగ్రహం
రాజిత దేవి Jun 27, 2026 11:22 AM హైదరాబాద్ 5 viewsabout 2 hours ago

పేదలకు భూ హక్కులు ఇస్తామని నమ్మించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు దళితులు, గిరిజనుల అసైన్డ్ భూములను లాక్కుంటోందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు. స్థానిక నేతలతో చేతులు కలిపి బలవంతపు భూసేకరణకు దిగుతోందని ఆరోపించారు.
పేదల జీవనోపాధిని దెబ్బతీస్తూ భూములు లాక్కోవడం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న భూకబ్జా అని విమర్శించారు. తాము బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...