వార్తలకు తిరిగి వెళ్లండి

ధరణి పోర్టల్లో కరీంనగర్ డైరీకి చెందిన భూములను తమకు తెలియకుండానే తెలంగాణ ఫెడరేషన్ పేరిట మార్చడాన్ని నిరసిస్తూ పాడి రైతులు సోమవారం నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు.
డైరీ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వెళ్లి, కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రమ భూ మార్పిడిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

