వార్తలకు తిరిగి వెళ్లండి
శాసనసభ స్పీకర్పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద నిరసన తెలిపారు.
ఎస్సి సెల్ జిల్లా ఛైర్మన్ కొరివి అరుణ్కుమార్ నేతృత్వంలో బిఆర్ఎస్ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకుంది.
Comments
Loading comments...

