వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లోని స్థానిక కలెక్టరేట్ ప్రధాన రహదారిపై స్వాతంత్ర్య దినోత్సవం వేళ కొందరు యువకులు ద్విచక్రవాహనాలతో హల్చల్ చేశారు.
ప్రమాదకర రీతిలో రేసింగులకు దిగుతూ, విపరీతమైన శబ్దాలతో వాహనదారులను, స్థానికులను భయాందోళనకు గురిచేశారు. ఇటువంటి ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

