వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కనిమెరక గ్రామంలో బుంగ సంధ్య (24) అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. తన కుమార్తెను అల్లుడే కొట్టి చంపాడని.. కింద పడి చనిపోయినట్లు తమకు అబద్ధం చెప్పినట్లు మృతురాలి తల్లి ఈశ్వరమ్మ ఆరోపిస్తున్నారు.
సమాచారం అందుకున్న బొండపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబసభ్యులు, స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సంధ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Loading comments...

