వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు హామీ ఇస్తేనే పోటీ చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తనకు నల్లగొండలో సొంత ఇల్లు, గ్రామంలో భూములు లేవని తెలిపారు.
ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో ఉన్నానని పేర్కొన్న మంత్రి, నల్లగొండను రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కార్పొరేషన్గా మార్చి మౌలిక వసతుల అభివృద్ధికి భారీ నిధులు కేటాయించినట్లు వివరించారు.
Comments
Loading comments...
