Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంపు కొడుతున్న పాఠశాల తరగతి గదులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 17, 2026 10:32 AM నిర్మల్General
నిర్మల్ లోని నాయుడి వాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిత్యం తరగతి గదులు కంపు కొడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. పాఠశాలకు అనుకునే మురికి కాలువ ఉండగా వారాల తరబడి శుభ్రపరచకపోవడంతో దుర్వాసన, దోమలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కా సిసి రోడ్ల నిర్మాణాలు చేపట్టినా అధికారులు, పాలకులు మురికి కాలువల నిర్మాణాలను మరవడంతోనే పరిస్థితులు ఇలా దాపురించాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...