Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నవారికి తప్పని కష్టాలు: వృద్ధ దంపతుల దీనస్థితిపై అధికారుల విచారణ

Follow Udayam on Google
sudheer Aug 20, 2026 8:08 PM కరీంనగర్General
కన్నవారికి తప్పని కష్టాలు: వృద్ధ దంపతుల దీనస్థితిపై అధికారుల విచారణ - Udayam
కుమారులు ఆదరించకపోవడంతో కరీంనగర్ జీజీహెచ్ వరండాలో దీనస్థితిలో పడివున్న కిసాన్ నగర్‌కు చెందిన వృద్ధ దంపతులు గన్ను లక్ష్మి-మోహన్‌ల ఉదంతంపై జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి విచారణ చేపట్టారు. చిన్న కుమారుడు ఆటోలో పంపేయడం, ఇక్కడ పెద్ద కుమారుడు కూడా పోషించలేనని చేతులెత్తేయడంతో స్వచ్ఛంద సంస్థ వీరిని ‘స్పందన’ వృద్ధాశ్రమానికి తరలించింది.చట్టం ప్రకారం బాధ్యులైన కుమారులపై చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు.

Comments

G
Loading comments...