వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ నుంచి మైలార్దేవరంపల్లి వెళ్లే మార్గంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు రక్షణ కంచె లేకపోవడంతో ప్రయాణికులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. రహదారి సమీపంలోనే ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి రక్షణ కంచె ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Loading comments...

