వార్తలకు తిరిగి వెళ్లండి

ముథోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కళ్యాణ మండప నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
గ్రామంలో సామాజిక అవసరాల కోసం కళ్యాణ మండపాన్ని నిర్మించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య భూమిపూజ నిర్వహించి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మండపం నిర్మాణంతో స్థానికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
Comments
Loading comments...

