వార్తలకు తిరిగి వెళ్లండి

కళాకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి ఆరేటి రామారావు డిమాండ్ చేశారు. పెదకాకాని మండలం వెనిగండ్లలో డప్పు కళాకారులతో సమావేశమై, నిలిచిపోయిన పెన్షన్లను పునరుద్ధరించాలని కోరారు.
తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు కళాకారులంతా అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

