వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి పట్టణంలోని రాంపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసితులు శుక్రవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తమకు కేటాయించిన ఆట స్థలాన్ని ఇతరులకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనీస అవసరాలైన ఆట స్థలం, అంగన్వాడీ కేంద్రానికి భూమిని కేటాయించి తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని నాయకులు శ్రీనివాస్ హెచ్చరించారు.
Comments
Loading comments...

