Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ కు రాఖీలు కట్టిన విద్యార్థులు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 27, 2026 4:47 PM నాగర్ కర్నూల్General
కలెక్టర్ కు రాఖీలు కట్టిన విద్యార్థులు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్‌ ను సరస్వతి శిశు మంది విద్యార్థులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యాభ్యాసం, ఆసక్తులు, భవిష్యత్తు లక్ష్యాలపై విద్యార్థులతో కలెక్టర్ ఆత్మీయంగా ముచ్చటించారు. రాఖీ పండుగ కుటుంబ బంధాలు, ప్రేమానురాగాలు, సోదరభావాన్ని పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...