Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం కోర్టు ప్రాంగణంలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 15, 2026 2:48 PM ఖమ్మంGeneral
ఖమ్మం కోర్టు ప్రాంగణంలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు - Udayam
స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు తెలిపారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. వీరుల త్యాగాలతో స్వాతంత్ర్యం వచ్చినందున సమరయోధులను స్మరించుకోవాలని సూచించారు. కార్య క్రమంలో కోర్టు అధికారులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఉన్నారు.

Comments

G
Loading comments...