వార్తలకు తిరిగి వెళ్లండి
జలుమూరులో ఖరీఫ్ సాగు ప్రారంభం
ఏరువాక పున్నమితో జలుమూరు మండల రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పొలాల్లో దుక్కులు చేపడుతూ పంట పనుల్లో బిజీగా మారారు. గత ఏడాది 22,132 ఎకరాల్లో సాగు జరగగా, ఈసారి కూడా అదే స్థాయిలో సాగు లక్ష్యంగా రైతులు ముందుకు సాగుతున్నారు.
వ్యవసాయ అధికారులు ఇప్పటికే 826 క్వింటాళ్ల విత్తనాలు, అవసరమైన యూరియాను ఆర్ఎస్కేల ద్వారా పంపిణీ చేసినట్లు ఏవో రవికుమార్ తెలిపారు.
Comments
Loading comments...