Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలుమూరులో ఖరీఫ్ సాగు ప్రారంభం

శ్రుతి రెడ్డి Jun 30, 2026 7:13 AM శ్రీకాకుళం 3 viewsabout 4 hours ago
ఏరువాక పున్నమితో జలుమూరు మండల రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పొలాల్లో దుక్కులు చేపడుతూ పంట పనుల్లో బిజీగా మారారు. గత ఏడాది 22,132 ఎకరాల్లో సాగు జరగగా, ఈసారి కూడా అదే స్థాయిలో సాగు లక్ష్యంగా రైతులు ముందుకు సాగుతున్నారు. వ్యవసాయ అధికారులు ఇప్పటికే 826 క్వింటాళ్ల విత్తనాలు, అవసరమైన యూరియాను ఆర్ఎస్కేల ద్వారా పంపిణీ చేసినట్లు ఏవో రవికుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...