Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ స్కూళ్లలో ఏఐతో హాజరు!

శ్రీజ రెడ్డి Jun 30, 2026 10:00 AM అమరావతి 2 viewsabout 2 hours ago
ఏపీ స్కూళ్లలో ఏఐతో హాజరు! - Udayam Digital
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు కోసం విద్యాశాఖ అత్యాధునిక ఏఐ సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఇకపై గ్రూప్ ఫొటో తీయడం ద్వారా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో విద్యార్థుల హాజరు ఆటోమేటిక్‌గా నమోదవుతుంది. మంగళగిరి, తాడేపల్లి, విజయవాడలో ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ విధానం విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. దీనివల్ల ఉపాధ్యాయుల సమయం ఆదా అవ్వడమే కాకుండా, హాజరు నమోదులో మరింత పారదర్శకత, ఖచ్చితత్వం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...