Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో ఘోర ప్రమాదం: ముగ్గురు మృతి

కౌశిక్ శర్మ Jun 30, 2026 10:10 AM విజయవాడ 7 viewsabout 1 hour ago
విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులోని గొల్లపూడి ఫ్లైఓవర్ సమీపంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. చిలుకలూరిపేట నుండి విజయవాడ వస్తుండగా, వేగంగా వచ్చిన లారీ వారి కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...