వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీశైలంలో సీసీ రోడ్ల ప్రారంభం

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి బండి ఆత్మకూరు మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వెంగళరెడ్డిపేటలో రూ. 10 లక్షలు, కడమలకాల్వ గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు.
వెంగళరెడ్డిపేటలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే, కడమలకాల్వలో ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ పనులు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
Comments
Loading comments...