వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖలో రాష్ట్రపతి ముర్ముకు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న రాష్ట్రపతి అక్కడి నుండి రోడ్డు మార్గాన నోవాటెల్ హోటల్కు చేరుకున్నారు. మరికాసేపట్లో జరగనున్న విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు.
Comments
Loading comments...