Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో పదవీ విరమణ పొందిన అధికారులకు సన్మానం

Follow Udayam on Google
రవళి దేవి Jun 30, 2026 3:26 PM కర్నూలుGeneral
కర్నూలులో పదవీ విరమణ పొందిన అధికారులకు సన్మానం - Udayam
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం 13 మంది పదవీ విరమణ పొందిన అధికారులను ఘనంగా సన్మానించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ వీరికి జ్ఞాపికలు అందించి వారి సుదీర్ఘ సేవలను కొనియాడారు. పదవీ విరమణ తర్వాత కూడా ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసు శాఖ అండగా ఉంటుందని అధికారులు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, విశ్రాంత ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...