వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో నంద్యాల జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. సాధారణంగా 2,20,230 హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 1,33,039 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
సాధారణ సాగులో 60 శాతం మాత్రమే సాగు కాగా, పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
Comments
Loading comments...

