Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కావేరిపై సీఎంల కీలక భేటీ

శిరీష గౌడ్ Jul 25, 2026 9:07 AM అల్ ఇండియా about 1 hour ago
కావేరిపై సీఎంల కీలక భేటీ - Udayam Digital
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ఆగస్టు 3న కర్ణాటకలో పర్యటించి సీఎం డీకే శివకుమార్‌తో సమావేశం కానున్నారు. కావేరి జలాల పంపిణీ, మేకెదాటు డ్యామ్‌ అంశాలపై చర్చించనున్నారు. కావేరి నీరు విడుదల కాక మెట్టూరు జలాశయం ఎండిపోయిందని, డెల్టా జిల్లాల్లో వరి సాగు దెబ్బతిందని మంత్రి వినోద్‌ తెలిపారు. మేకెదాటు డ్యామ్‌ నిర్మాణాన్ని తమిళనాడు అంగీకరించదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...