వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రక్షణ చట్టం ముసాయిదాపై చర్చించేందుకు నేడు అమరావతిలో కీలక సమావేశం జరగనుంది. బీసీ వర్గానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని ముసాయిదాపై అభిప్రాయాలు వెల్లడించనున్నారు.
కులాలు, వృత్తుల పేరుతో బీసీలను దూషించడం, దాడులు, దౌర్జన్యాల నుంచి రక్షణ కల్పించేలా చట్టం రూపొందిస్తున్నారు. ముసాయిదాకు తుది మెరుగులు దిద్ది ప్రభుత్వానికి సమర్పించే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Comments
Loading comments...
