Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేదార్‌నాథ్ యాత్ర నిలిపారు

వివేక్ గౌడ్ Jul 23, 2026 6:14 AM అల్ ఇండియా in about 4 hours
కేదార్‌నాథ్ యాత్ర నిలిపారు - Udayam Digital
ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలకు గౌరీకుండ్ వద్ద కొండచరియలు విరిగిపడి కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా ఆగిపోయింది. రహదారి పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతుండటంతో భక్తులను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేశారు. మరోవైపు కైలాస మానసరోవర్ యాత్ర ముగించుకుని తిరిగొస్తున్న రాజస్థాన్ యాత్రికుడు గౌరీశంకర్ గుండెపోటుతో మరణించారు. ఆయన మృతదేహాన్ని అధికారులు పిథౌరాగఢ్‌కు హెలికాప్టర్‌ ద్వారా తరలించారు.

Comments

G
Loading comments...