Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరిలో బీజేపీ నేతల ప్లెక్సీల చించివేత కలకలం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 03, 2026 11:00 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కదిరిలో బీజేపీ నేతల ప్లెక్సీల చించివేత కలకలం - Udayam
కదిరిలో ఈ నెల 5వ తేదీన జరగనున్న బిజెపి ర్యాలీకి సంబంధించిన ప్రచార ప్లెక్సీలు, ఫోల్డర్లను గుర్తుతెలియని వ్యక్తులు చించివేసిన ఘటనపై బిజెపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ నాయకుడు విష్ణువర్ధన్ రాక కోసం ఏర్పాటు చేసిన ప్లెక్సీ చించివేత ఘటనపై తక్షణమే విచారణ చేపట్టి, ప్లెక్సీలు చించివేసిన వారిని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి, చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకుడు వెంకటేసులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...