వార్తలకు తిరిగి వెళ్లండి

దశాబ్దాల పోరాటం ఫలించిన రోజే జూన్ 2 అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేసిన ఆయన, పదవులు, ప్రాణాల త్యాగానికి వెనుకాడకుండా కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు.
అధికారంలో ఉన్నా, లేకపోయినా తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. వచ్చే 2028 డిసెంబర్ ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రజలే చెబుతున్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

