Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌ డెయిరీ భూములపై నేడు ధర్నా

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 3:01 PM కరీంనగర్తెలంగాణ
కరీంనగర్‌ డెయిరీ భూములపై నేడు ధర్నా - Udayam
కరీంనగర్‌ డెయిరీ భూముల యాజమాన్య మార్పుపై వివాదం ముదురుతోంది. ధరణిలో డెయిరీ పేరుతో ఉన్న భూములు భూభారతిలో తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ పేరిట మారడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుమార్పును రద్దు చేసి డెయిరీ పేరుతోనే నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. డెయిరీ ఛైర్మన్‌ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నేడు 5 వేల మందితో కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు సిద్ధమయ్యారు.

Comments

G
Loading comments...