వార్తలకు తిరిగి వెళ్లండి
కార్గిల్ అమరవీరుల త్యాగాలు ఆదర్శం

మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో అంబేడ్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో 388వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి, కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లను స్మరించారు.
యువత సాయుధ దళాల్లో చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలని, వీర జవాన్ల త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య పిలుపునిచ్చారు.
Comments
Loading comments...