వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్య కర్తల సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి మాట్లాడుతూ..
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు ఏడు రోజులపాటు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

