వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా రాఖీలు కట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
డీఎస్పీ ఆదేశాల మేరకు సీఐ నరహరి ఆధ్వర్యంలో ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్, మహిళా ట్రాఫిక్ సిబ్బంది వాహనదారులకు రాఖీలు కట్టి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. జరిమానాల కంటే అవగాహనతో మార్పు తీసుకురావడమే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

