వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ పట్టణంలోని వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన గణనాథులను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆయన కాలనీ వాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు.
Comments
Loading comments...

