Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయలసీమలో జేఎస్‌డబ్ల్యూ ఉక్కు ఫ్యాక్టరీ పనులు ప్రారంభం

రూపేష్ గౌడ్ Jul 04, 2026 12:45 AM కడప 3 viewsabout 2 hours ago
రాయలసీమలో జేఎస్‌డబ్ల్యూ ఉక్కు ఫ్యాక్టరీ పనులు ప్రారంభం - Udayam Digital
వైఎస్సార్ కడప జిల్లాలో రూ.16,350 కోట్ల పెట్టుబడితో జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. 2028 జులై నాటికి ఇక్కడ ఉక్కు ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. దీంతో పాటు పలు విద్యుత్ ప్రాజెక్టులు, విజయనగరంలో పారిశ్రామిక పార్కును కూడా ప్రారంభించారు. రాయలసీమను పారిశ్రామిక హబ్‌గా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...