Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుపై దురుసు ప్రవర్తన.. సీఐ జయన్నపై చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
H M G H Q Sep 14, 2026 8:09 PM కర్నూలుGeneral
జర్నలిస్టుపై దురుసు ప్రవర్తన.. సీఐ జయన్నపై చర్యలు తీసుకోవాలి - Udayam
పత్తికొండ విశాలాంధ్ర రిపోర్టర్ ఎం. నాగరాజుపై దురుసుగా ప్రవర్తించి, మెడపట్టి బయటకు పంపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ ఏ. జయన్నను సస్పెండ్ చేయాలని కోరుతూ జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె. రామకృష్ణకు వినతిపత్రం ఇచ్చారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. రామకృష్ణ స్పందిస్తూ, రేపు సీఎం, హోంశాఖ, డీజీపీని కలిసి విషయం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...