వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలో విశాలాంధ్ర విలేకరి పి.గోవిందరావుపై జరిగిన దాడిని మందస మండల జర్నలిస్టుల సంఘం గురువారం తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ బలివాడ శ్రీహరికి వినతిపత్రం అందజేశారు.
జర్నలిస్టులకు రక్షణ కల్పించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల సంఘం కోరింది.
Comments
Loading comments...

