వార్తలకు తిరిగి వెళ్లండి
జేఎన్టీయూ వద్ద హైటెన్షన్

ఆర్ 22 నిబంధన కింద గ్రేస్ మార్కులు పెంచాలని డిమాండ్ చేస్తూ జేఎన్టీయూ విద్యార్థులు యూనివర్సిటీ గేటు వద్ద భారీ ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఆందోళనకారులు పోలీసులను తోసుకుంటూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్దకు దూసుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడంతో యూనివర్సిటీ పరిసరాలు రణరంగంగా మారాయి.
Comments
Loading comments...