వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం బెలగాంలో బీజీఎన్, బీపీఎన్ అపార్ట్మెంట్ల సమీపంలో జియో సెల్ టవర్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని అపార్ట్మెంట్ యజమానుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.
ఈ మేరకు శుక్రవారం జాయింట్ కలెక్టర్ వైశాలికి వినతిపత్రం ఇచ్చారు. టవర్ చుట్టూ సుమారు 100కుటుంబాలు నివసిస్తున్నందున ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. సమస్యపై సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని జేసీ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

