వార్తలకు తిరిగి వెళ్లండి
ఉట్నూర్ ఏజెన్సీలో జియో నిరసన
రాజిత దేవి Jun 25, 2026 9:15 AM ఆదిలాబాద్ 10 viewsabout 20 hours ago

ఉట్నూర్ ఏజెన్సీలో జియో నెట్వర్క్ సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన సిగ్నల్, ఇంటర్నెట్ లేకపోయినా డబ్బులు వసూలు చేయడంపై ప్రజా సంఘాల నాయకుడు భరత్ చౌహన్, గ్రామస్తులు మండిపడ్డారు.
ఈ సమస్యపై ఆందోళన చేపట్టిన గ్రామస్తులు, జియో సంస్థ నిర్లక్ష్యానికి నిరసనగా ప్లకార్డులను దహనం చేశారు. వెంటనే సేవలు మెరుగుపరచాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
Comments
Loading comments...