Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఎత్తైన ఏకశిల విగ్రహం ఎక్కడో తెలుసా

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 12, 2026 11:37 AM నాగర్ కర్నూల్General
జిల్లాలో ఎత్తైన ఏకశిల విగ్రహం ఎక్కడో తెలుసా - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామ సమీపంలోని దుందుభి నది తీరాన పచ్చటి పొలాల మధ్య ఎత్తైన ఏకశిల గణపతి విగ్రహం కొలువుదీరింది. 12వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యుల రాజు తైలంపుడు నల్లటి గుండు పై 30 అడుగుల ఎత్తైన గణపతి రాతి విగ్రహాన్ని చెక్కించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఐశ్వర్య గణపతిగా, గుండు గణపతిగా ప్రఖ్యాతి చెందాడు. ఈ వినాయకునికి గుడి నిర్మించాలని స్థానిక భక్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...