వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
ఖరీఫ్ సీజన్కు 37,707 టన్నుల యూరియా అవసరం కాగా 27,147 టన్నులు చేరిందన్నారు. ప్రస్తుతం 11,132 టన్నుల యూరియా, 3,766 టన్నుల డీఏపీ నిల్వ ఉందన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన 16 మంది డీలర్ల లైసెన్సులు సస్పెండ్ చేసి, 62 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు.
Comments
Loading comments...

