Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల పెంపునకు ఎంపీకి వినతి.

Super Admin Jul 26, 2026 5:11 PM మేడ్చల్ మల్కాజిగిరి about 2 hours ago
జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల పెంపునకు ఎంపీకి వినతి. - Udayam Digital
మేడ్చల్: జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డిని కలిసి పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎస్‌ఎఫ్‌ఏ) వేతనాలను పెంచాలని కోరారు. నగర పరిశుభ్రతకు కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తగిన వేతనాలు, సంక్షేమం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలని ఎంపీని కోరారు.

Comments

G
Loading comments...