వార్తలకు తిరిగి వెళ్లండి

జీడి పిక్కలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని సీపీఎం మండల కన్వీనర్ సాంబమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవకోన పంచాయతీలో రైతులతో కలిసి శుక్రవారం ఆయన మాట్లాడారు.
ఐటీడీఏ, ఉద్యానశాఖ అధికారులు జీడి తోటలను పరిశీలించి దిగుబడి పెంపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. దళారుల దోపిడీ అరికట్టి కిలో రూ. 200 లకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

