వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సమీపిస్తుండటంతో సుదూర ప్రాంతాల నుంచి గణేశ్ ప్రతిమలను తరలిస్తున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల-గొల్లపల్లి ప్రధాన రహదారి జాబితాపూర్ సమీపంలో చొప్పదండికి చెందిన యువకులు భారీ గణేశ్ ప్రతిమను తరలించేందుకు ఇబ్బందులు పడ్డారు.
రహదారికి ఇరువైపులా చెట్లు ఉండటంతో ప్రతిమను రోడ్డు మధ్యలో తీసుకెళ్లాల్సి వచ్చింది. అడ్డు వచ్చిన చెట్ల కొమ్మలను తొలగిస్తూ.. జాగ్రత్తగా వినాయకుడి ప్రతిమను తరలించారు.
Comments
Loading comments...

