వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో మేజర్ ధ్యాన్ చంద్ వేడుకలను ఆగస్టు 29న నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి తెలిపారు. ఆగస్టు 28న ‘ఖేలేగా భారత్, జీతేగా భారత్’ నినాదంతో ర్యాలీ ఉంటుందన్నారు.
29న క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్ పోటీలు ఉంటాయన్నారు. 30న విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.
Comments
Loading comments...

