వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల మున్సిపల్ పరిధిలోని యాకిన్పూర్ శివారులో రైతులు నిరసనకు దిగారు. పంటలకు అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ సరఫరాలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను కోరారు.
Comments
Loading comments...

