వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు. వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

